- శక్తి అంతా నీలోనే వుంది, ఆ శక్తివల్లె అంతఃశక్తి యొక్క పరిణామ ఫలితాలు వెలువడతాయి. అవే ఆత్మానందాలు. ఇవి, వీటిని మించిన శక్తులు ఎక్కడా లేవు. ఈ శక్తే, అన్నింటిలో (భౌతికంలో) మనం వెతికేది ఆనందం. కాబట్టి ఈ దానివల్లే ఆ ఆనందం పుడుతుంది.
- భౌతికంలో దొరికే ఆనందాలు చిన్నవిగా వుంటాయి, కేవలం అవి మన మనస్సును మాత్రమే రంజింపజేస్తాయి. కాని, ఆధ్యాత్మికంలో నీ అంతరంగంలోని శక్తి వాళ్ళ, దాని ఊర్ధ్వగమనం వలన నీకు ఆత్మానందం చేకూరుతుంది. ఈ ఆత్మానందం చాలా చెప్పలేని, అనగా, (మామూలు ఆనందానితో పోలిస్తే)అనంతమైన రెట్లు వుంటుంది. ఇదే ప్రతీ జీవి తను తన కర్మలో సంతృప్తి వలన, సంభోగంలో సంతృప్తి వలన, తినడం వలన, త్రాగడం వలన, భౌతికమైన ఏ క్రియవలననైనా తను ఆనందం పొందలేడు. కేవలం సుఖం, దుఖం మాత్రమే పొందగలడు ఇది విశ్వసత్యం.
- ఎల్లప్పుడూ నీలో వున్నా ఆనంద స్ధితి (భైరవ-జాగృతస్థితి) లో వున్నప్పుడు నీకు భౌతిక (బాహ్య) మైన ఏ కర్మతో సంబంధం లేదు. ఎందుకంటే సుఖంలో అడుగు పెడితే దుఖం నీ వెంబడే వస్తుంది.
- నీ అందం ఎంత ఎక్కువ రెట్లు ప్రదర్శించాలనుకుంటే వాటి వెంబడి నీడ అంత పెద్దదవుతుంది.
- భౌతికానందాలు నీచమైనవి, అల్పమైనవి. ఆధ్యాత్మికాలు ఎల్లప్పుడూ సత్యమైనవి, సంతృప్తికరమైనవి, శాశ్వతమైనవి.
- భౌతికంలో క్రియలు చేయు! ఆధ్యాత్మికంలో అవస్థ వచ్చేంతవరకు. ఒకే సమయంలో పూర్తి ఆధ్యాత్మికత నీకు చెప్పకనే వస్తుంది. అదే భైరవస్థితి.
అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్రము". ప్రవరాఖ్యుడి దినచర్య ఎలావుండేదంటే - . వరణాతరంగిణీదర వికస్వరనూత్న కమలకషాయగంధము వహించి ప్రత్యూష పవనాంకురములు పైకొను వేళ వామనస్తుతిపరత్వమున లేచి సచ్చాత్రుడగుచు నిచ్చలు నేగి యయ్యేట నఘమర్షణస్నాన మాచరించి సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి సైకతస్థలి గర్మసాక్షి కెఱగి . ఫల సమిత్కుశ కుసుమాది బహు పదార్థ తతియు నుదికిన మడుగు దొవతులు గొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చు నింటికి బ్రజ తన్ను మెచ్చి చూడ . ప్రత్యూషం అంటే ప్రాతఃకాలం తూర్పుదిక్కున అరుణారుణరేఖలు రాకముందు తెలతెలవారుతున్న సమయం. ఆ ప్రశాంతవేళ చల్లని పిల్లతెమ్మెరలు (పవన + అంకురములు) మెల్లమెల్లగా వీస్తూ ఉంటాయి. అరుణాస్పదంలో పక్కనే వరణానది ప్రవహిస్తొంది. కనక ఆ తరంగిణి ఒడ్డున అప్పుడే వికసిస్తూ, ఇంకా సగం విచ్చుకునీ (దర వికస్వర) సగం విచ్చుకుంటూ ఉన్న క్రొందమ్ములు (నూత్న కమలములు). వాటి కషాయ గంధం - రవ్వంత వగరు అనిపించే సుగంధాన్ని ప్రత్యూష పవనాంకురాలు వహించి వీతెంచుతున్నాయి. అవి అలా పైకొనే వేళ ప్రవరుడు నిద్ర లేస్తాడు. విష్ణుదేవుడి స్తోత్రాలు పఠిస్తూ (వామనస్తుతి పరత్వము
Comments
Post a Comment