- భౌతికంగా తీసుకునే ఆహారంలో శక్తి నిక్షిప్తమై వుంటుంది; ఈ యొక్క శక్తి కొన్ని స్థాయిలలో ఉండబడుతుంది. వివిధ శక్తి స్థాయుల గురించి చెప్పుకుంటే, అవి మూడు రకాలు-స్థూల శక్తి, సూక్ష్మ శక్తి, మరియు విశ్వ శక్తి. స్థూల శక్తి శరీరం ద్వారా పొందబడితే, అటు స్థూల శక్తి మానసిక లేదా హృదయ కర్మల ద్వారా పొందబడుతుంది, చివరగా విశ్వ శక్తి నీయొక్క హృదయ లేదా ఆత్మ ద్వారా పొందబడుతుంది.
- అసలు శక్తి రెండు రకాలు ఒకటి ధన (సవ్య) శక్తి, రెండోది ఋణ (అపసవ్య) శక్తి అని చెప్పుకోవచ్చు. ఋణ శక్తి మన శరీరం ద్వారా ఎక్కువగా తేబడుతుంది, ధన శక్తి మన ఆత్మ లేదా హృదయం ద్వారా తేబడుతుంది, కాని రెండు విధాల శక్తులూ మనస్సు ద్వారా తేబడతాయి.
- కనుక, అత్యంత ఉన్నతమైన శక్తి కొరకు మన ఆత్మను ఆశ్రయించక తప్పదు. ఇక మిగతా రెండు శక్తి వాహకాలు మనకు సమాజం పుట్టినప్పటి నుండి నడపబడుతూ ఉంటున్నాయి. ఇది సర్వ సాధారణం. ఆత్మను ఆశ్రయించడానికి ఏకైక మార్గం ధ్యాన్నం.
అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్రము". ప్రవరాఖ్యుడి దినచర్య ఎలావుండేదంటే - . వరణాతరంగిణీదర వికస్వరనూత్న కమలకషాయగంధము వహించి ప్రత్యూష పవనాంకురములు పైకొను వేళ వామనస్తుతిపరత్వమున లేచి సచ్చాత్రుడగుచు నిచ్చలు నేగి యయ్యేట నఘమర్షణస్నాన మాచరించి సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి సైకతస్థలి గర్మసాక్షి కెఱగి . ఫల సమిత్కుశ కుసుమాది బహు పదార్థ తతియు నుదికిన మడుగు దొవతులు గొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చు నింటికి బ్రజ తన్ను మెచ్చి చూడ . ప్రత్యూషం అంటే ప్రాతఃకాలం తూర్పుదిక్కున అరుణారుణరేఖలు రాకముందు తెలతెలవారుతున్న సమయం. ఆ ప్రశాంతవేళ చల్లని పిల్లతెమ్మెరలు (పవన + అంకురములు) మెల్లమెల్లగా వీస్తూ ఉంటాయి. అరుణాస్పదంలో పక్కనే వరణానది ప్రవహిస్తొంది. కనక ఆ తరంగిణి ఒడ్డున అప్పుడే వికసిస్తూ, ఇంకా సగం విచ్చుకునీ (దర వికస్వర) సగం విచ్చుకుంటూ ఉన్న క్రొందమ్ములు (నూత్న కమలములు). వాటి కషాయ గంధం - రవ్వంత వగరు అనిపించే సుగంధాన్ని ప్రత్యూష పవనాంకురాలు వహించి వీతెంచుతున్నాయి. అవి అలా పైకొనే వేళ ప్రవరుడు నిద్ర లేస్తాడు. విష్ణుదేవుడి స్తోత్రాలు పఠిస్తూ (వామనస్తుతి పరత్వము
Comments
Post a Comment